టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్ అంటూ రెండు వారాల క్రితం నిర్థారణ అయిన విషయం తెల్సిందే.వారు తాజాగా కరోనా నెగటివ్ అంటూ నిర్థారణ అయ్యారు.
వారికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనాను జయించారు.ప్రస్తుతం వారంతా కూడా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
జక్కన్న కరోను జయించాడు అనుకుంటున్న సమయంలో మరో దర్శకుడికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.దీంతో టాలీవుడ్ మళ్లీ ఉలిక్కి పడ్డట్లయ్యింది.
ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.మొదటి సినిమాతో మంచి పేరు దక్కించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘మహాసముద్రం’ను శర్వానంద్తో చేసేందుకు రెడీ అవుతున్నాడు.
మరో వైపు ఒకటి రెండు వెబ్ సిరీస్ల స్క్రిప్ట్ వర్క్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు.ఇలాంటి సమయంలో దర్శకుడు అజయ్ భూపతికి పాజిటివ్ అంటూ వచ్చిందని నిర్థారణ అయ్యింది.
ఆయన ఇంట్లో వారి పరిస్థితి ఏంటీ అనేది క్లారిటీ రాలేదు.కాని దర్శకుడు మాత్రం ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగానే ఉన్నాడట.ఆయన ఆరోగ్యంపై వైధ్యులు స్పందిస్తూ హోం క్వారెంటైన్ సరిపోతుందని చెప్పారట.దాంతో రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ మాదిరిగా హోం క్వారెంటైన్లోనే ఈ దర్శకుడు ఉన్నట్లుగా తెలుస్తోంది.అతి త్వరలోనే అజయ్ భూపతి కోలుకుని మళ్లీ మహాసముద్రం సినిమాను మొదలు పెట్టాలని ఆశిద్దాం.