కారుణ్య నియామకాలు( Compassionate Appointment ) పొందిన ఉద్యోగులు విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్( Additional Collector Sri Kheemya Naik ) ఆకాంక్షించారు.
విధి నిర్వహణలో చనిపోయిన ఇద్దరు వీఆర్ఓల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పత్రాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో శుక్రవారం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అందజేశారు.
ఉద్యోగాలు పొందిన వారిలో ఆర్.సరస్వతి, టీ.శివ ఉన్నారు.ఇక్కడ కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.