ఓటు హక్కు వినియోగం అందరి బాధ్యత..సఖీ కేంద్రంలో అవగాహన సదస్సు

స్వీప్ ఆద్వర్యంలో సఖీ కేంద్రంలో అవగాహన సదస్సు రాజన్న సిరిసిల్ల జిల్లా :ఓటు హక్కు వినియోగం అందరి బాధ్యతని స్వీప్ ఆద్వర్యంలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు ‌.

(స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్ పార్టిసిపేషన్ ) ఆద్వర్యంలో  కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు సిరిసిల్లలోని సఖీ కేంద్రంలో ఐ ఓటు ఫర్ ష్యూర్ ఓటు హక్కు నా బాధ్యత పై దివ్యాoగులకు అవగాహన కల్పించారు.

అనంతరం అధికారులు ఓటరు హెల్ప్ లైన్, సాక్షం యాప్, పోలింగ్ కేంద్రాల్లో దివ్యాoగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హోం ఓటింగ్ సదుపాయం పై వివరించారు.కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్, డీడబ్ల్యూఓ లక్ష్మీ రాజం, పలువురు దివ్యాoగులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్

Latest Rajanna Sircilla News