అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలింపు.5 కిలోల గంజాయి స్వాధీనం.తరచు గంజాయి అక్రమ రవాణా , విక్రయాలు జరిపితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదివారం రోజున వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్.నిందుతుల వివరాలు.

వికాస్ కుమార్ గ్రామం జాన్పూర్ , ఉత్తర్ ప్రదేశ్ .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ల ద్వారా ఒడిశా రాష్ట్రం నుండి 5 కిలోల గంజాయిని తెప్పించి జగదల్పూర్ లో కలుసుకొని ఆ గంజాయితో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో జగధల్పూర్ నుండి ట్రావెల్స్ బస్సు ద్వారా కరీంనగర్ కి అక్కడ నుండి బస్సు లో వేములవాడకు వచ్చి వేములవాడ చింతలతానా శివారుకి వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకి చింతల తానా శివారు ఆర్టీసీ బస్ డిపో దగ్గర లో ఆ ముగ్గురిని వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ వ్యక్తుల ద్వారా గంజాయిని జగదల్ పూర్ కి తెప్పించి అక్కడి నుండి ముగ్గురూ కలిసి వేములవాడ వచ్చి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతామని చెప్పాగా వారి వద్ద నుండి 5 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకొని అరెస్టుచేసి ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగింది అని ఎస్పీ తెలిపారు.

గంజాయి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన ఐడి పార్టీ కానిస్టేబుల్స్ సమీ, గోపాల్, శ్రీనివాస్, ఎస్ఐ అంజయ్య, సీఐ శ్రీనివాస్ లను ఎస్పీ గ అభినందించి రివార్డ్ లు అందించారు.జిల్లాలో గంజాయి , మతుపదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని ఈ సంవత్సరం జిల్లాలో అక్రమ గంజాయి కి సంబంధించిన 14 కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్ట్ చేసి సుమారుగా ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేయడం జరిగిందని, తరచుగా జిల్లాలో అక్రమ గంజాయి రవాణాకు పాల్పడితే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందివ్వండి.దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తుని నెట్టేసుకుంటున్నారని,అట్టి యువత భవిష్యత్ కాపాడే బాధ్యత మన అందరిపై ఉన్నదని,జిల్లా పరిధిలో గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం మెసేజ్ యూవర్ ఎస్పీ నెంబర్ 630-392-2572 కు లేదా డయల్100 కి సమాచారం అందించి, గంజాయి ,మత్తు పధార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంమై గంజాయి రహిత జిల్లాగా మార్చాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

ఎస్పీ వెంట వేములవాడ ఇంచార్జ్ సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ అంజయ్య, సిబ్బంది ఉన్నారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

Latest Rajanna Sircilla News