మహారాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.చంద్రాపూర్ జిల్లా సావ్లి పరిధిలో మొర్మడా గ్రామంలో నాలుగేళ్ల బాలుడిపై పులి దాడికి పాల్పడిందని తెలుస్తోంది.
ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసిన పులి అడవిలోకి లాక్కెళ్లింది.తల్లి చూస్తుండగానే పులి బాలుడిని లాక్కెళ్లినట్లు తెలుస్తోంది.
అటవీ ప్రాంతంలో బాలుడి శరీర భాగాలను గుర్తించారని సమాచారం.అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం పులి జాడను కనుక్కొనేందుకు చర్యలకు సిద్ధం అయ్యారు.మరోవైపు పులి గ్రామాల్లోకి వచ్చి దాడి చేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.