దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ( S.S Rajamouli ) త్వరలోనే మహేష్ బాబు( Mahesh Babu ) తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరగబోతాయని ఇటీవల ఓ కార్యక్రమంలో కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నటీనటుల ఎంపిక విషయంలో కూడా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో సరైన విలన్ కోసం వేట మొదలు పెట్టారని తెలుస్తోంది.
ఈ వేటలో భాగంగా ఈయన నటుడు రానా( Rana ) ని ఎంపిక చేసినట్టు సమాచారం.ఇదివరకే రానా రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి ( Bahubali )సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఈయన భళ్ళాల దేవుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక ఈ సినిమా ద్వారా రానా కూడా పాన్ ఇండియా స్థాయిలో నటుడిగా మంచి గుర్తింపు పొందారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబును ఢీకొట్టడానికి రానా సరైన వ్యక్తి అని భావించిన రాజమౌళి తనని ఎంపిక చేశారని సమాచారం.
ఇక రానా కూడా ఇటీవల కాలంలో కేవలం హీరోగా మాత్రమే కాకుండా కథ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలలో నటించడానికి కూడా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.బాహుబలి సినిమా తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక ఈ సినిమాలో విలన్ గా రానా ఎంపిక అయినట్టు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఇలా రాజమౌళి మహేష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.