మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఒడ్డెర సంఘం కులస్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని శివరాత్రి వారి ఒడ్డెర సంఘం నకు చెందిన సుమారు 150 మందికి పైగా వడ్డెర సంఘం వారు స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.

 Oddera Community Joined The Congress Party Ellareddy Peta Mandal, Oddera Communi-TeluguStop.com

బి ఆర్ ఎస్ ప్రభుత్వం బిసి బందు పథకం ప్రవేశ పెట్టి మా గ్రామంలో ఒక్క వడ్డెర కులస్తుడికి కూడా బిసి బందు ఇవ్వలేదని,బిసి బందు కు అర్హులము కానీ మేము బి ఆర్ ఎస్ కు ఓట్లు వేయడానికి ఎలా పనికి వస్తామని వారు

అవలంబిస్తున్న విధానాలు నచ్ఛక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం సభ్యులు శివరాత్రి రాజం,కుమార్, కుంచం కనుకయ్య,శివరాత్రి నాంపెల్లి, దేవరాజు,దేవయ్య,లక్ష్మి, పద్మ, దేవలక్ష్మి, నర్సవ్వ ,అంజయ్య, బద్రి లతో పాటు సంఘం సభ్యులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మా రెడ్డి, పందిర్ల లింగంగౌడ్, గుండాడి రాంరెడ్డి,గంట ఆంజా గౌడ్, గంట బుచ్చయ్య గౌడ్,గంట రమేష్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube