ప్రవళిక మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివరామ్ రాథోడ్ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.
ఈ క్రమంలోనే తాను లొంగిపోతున్నట్లు నాంపల్లి కోర్టులో శివరామ్ రాథోడ్ సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు.ఈ మేరకు శివరామ్ దాఖలు చేసిన పిటిషన్ కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
అయితే ప్రవళిక బలవన్మరణానికి పాల్పడటానికి శివరామ్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంలో ప్రవళిక కుటుంబ సభ్యులు ఇటీవలే మంత్రి కేటీఆర్ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.