రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా..?: దాసోజు శ్రవణ్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు.తెలంగాణపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతోందో చెప్పాలన్నారు.

 Aren't You The One Who Put Mud In The Mouth Of The Farmers?: Dasoju Shravan-TeluguStop.com

బీజేపీ నేతలు రాష్ట్రానికి నిధులు రానివ్వడం లేదని ఆరోపించారు.బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీపై సమాధానం లేదని విమర్శించారు.

ఐటీఐఆర్ ను ఎందుకు గుజరాత్ కు తీసుకెళ్లారో చెప్పరన్న దాసోజు రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా అంటూ ధ్వజమెత్తారు.నల్ల చట్టాలతో రైతులను ఇబ్బంది పెట్టలేదా అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే రైతులకు సీఎం కేసీఆర్ చేసిన మేలుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.బీజేపీ నేతలు డ్రామాలు చేస్తే తెలంగాణ సమాజం ఇకపై నిలదీస్తుందని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube