కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు.తెలంగాణపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతోందో చెప్పాలన్నారు.
బీజేపీ నేతలు రాష్ట్రానికి నిధులు రానివ్వడం లేదని ఆరోపించారు.బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీపై సమాధానం లేదని విమర్శించారు.
ఐటీఐఆర్ ను ఎందుకు గుజరాత్ కు తీసుకెళ్లారో చెప్పరన్న దాసోజు రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా అంటూ ధ్వజమెత్తారు.నల్ల చట్టాలతో రైతులను ఇబ్బంది పెట్టలేదా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే రైతులకు సీఎం కేసీఆర్ చేసిన మేలుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.బీజేపీ నేతలు డ్రామాలు చేస్తే తెలంగాణ సమాజం ఇకపై నిలదీస్తుందని హెచ్చరించారు.