ఆ రెండు జిల్లాల్లో జనసేన సునామి సృష్టించబోతోందా..? హీరో శివాజీ సంచలన సర్వే!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత ఆసక్తికరంగా సాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఒక తెలుగు దేశం పార్టీ తరుపున నారా లోకేష్( Nara Lokesh ) ‘యువ గళం’ కార్యక్రమం తో రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతుంటే, మరోపక్క పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’( Varahi Vijaya Yatra )ని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు.

 Jana Sena Is Going To Create A Tsunami In Those Two Districts Sensational Survey-TeluguStop.com

లోకేష్ యాత్ర కంటే కూడా, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కి అపూర్వమైన స్పందన లభిస్తుంది.పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా జనాలు నీరాజనం పలికేస్తున్నారు.

యూత్ మరియు మాస్ పవన్ కళ్యాణ్ సభలకు రావడం మామూలే.కానీ ఈసారి ఆయన సభలకు అత్యధికంగా మహిళలు హాజరవ్వడం విశేషం.

రాష్ట్ర రాజకీయాల్లో వారాహి విజయ యాత్ర ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో ఉంది.ప్రభుత్వం చేస్తున్న మోసాలను పవన్ కళ్యాణ్ ఎత్తి చూపుతూ ముందుకు వెళ్తున్న విధానం అందరికీ నచ్చింది.

ప్రతీ ప్రాంతం లోను అక్కడ ఉన్న సమస్యలను లేవదీస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడగా, అవి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

Telugu Shivaji, Jana Sena, Janasena, Lokesh, Varahivijaya-Telugu Political News

ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న ప్రాంతాలలో సర్వేలను నిర్వహిస్తూ ఉంది.ఈ సర్వేలు కూడా పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపిస్తూ ఉండడం తో అధికార పార్టీ లో గుబులు మొదలైంది.ఇకపోతే రీసెంట్ గా ప్రముఖ హీరో శివాజీ( Shivaji ) ప్రస్తుత రాజకీయాలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ పార్టీ పై జనాల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉందని, కచ్చితంగా వచ్చే ఎన్నికలలో చిత్తు చిత్తు గా ఓడిపోతుందని చెప్పుకొచ్చాడు.అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ( Janasena party ) బలం చాలా పుంజుకుందని, వైసీపీ పార్టీ కంటే జనసేన పార్టీ పై జనాల్లో ఎక్కువ నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.

కూటమిగా వెళ్లినా, ఒంటరిగా వెళ్లినా జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెప్పుకొచ్చాడు హీరో శివాజీ.ఆయనకి చాలా సర్వే ఏజెన్సీస్ తో కాంటాక్ట్స్ ఉన్నాయట, వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారమే చెప్తున్నాను అని చెప్పుకొచ్చాడు.

Telugu Shivaji, Jana Sena, Janasena, Lokesh, Varahivijaya-Telugu Political News

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ మొదటి విడత పర్యటన నేటితో ముగియనుంది.నేడు ‘నర్సాపురం’ లో నిర్వహించే సభ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందని అంటున్నారు జనసేన పార్టీ నాయకులు.ఇక రెండవ విడత యాత్ర ని వచ్చే నెల 11 వ తారీఖు నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో జరగనుందని సమాచారం.అప్పటి వరకు ఆయన సినిమా షూటింగ్స్ లో బిజీ గా గడపనున్నాడు.

తొలి విడత వారాహి పర్యటన జనసేన పార్టీ నాయకుల్లో మరియు అభిమానుల్లో మామూలు జోష్ నింపలేదు.కచ్చితంగా ఈసారి బలంగా కొడుతామనే నమ్మకాన్ని కలిగించింది ఈ యాత్ర.

చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో ఈ యాత్ర కి ఇంకెంత ఆదరణ దక్కబోతుందో అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube