తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు.హరితహారాన్ని గతంలో హాస్యాస్పదం చేశారన్నారు.తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు.
దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ పేర్కొన్నారు.పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలేనని చెప్పారు.పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న కేసీఆర్ మహేశ్వరం, ఇబ్రహీంపట్నానికి నీళ్లు అందిస్తామన్నారు.గోదావరి నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రంలో అడవులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నామని వెల్లడించారు.