కీళ్ల నొప్పులు ఉన్నవారు అస్సలు పెట్టిన తినకండి...

కీళ్ల నొప్పులు ఒంట్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల వస్తాయి.

కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారు కొన్ని రకాల ఆహారాలను తినడం మానేస్తే సమస్య వెంటనే తగ్గిపోతుంది.

అయితే ఈ యూరిక్ యాసిడ్ ప్యూరిన్ పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు వస్తాయి.ప్యూరిన్ మనం తినే ఆహారాల్లో ఉంటుంది.

ఈ యూరిక్ యాసిడ్ మూత్ర విసర్జన ద్వారా బయటకు వెళుతుంది.ఒక వేళ మూత్రవిసర్జన సరిగా జరగకపోతే ఇది రక్తంలో అలాగే ఉండిపోతుంది.

ఇక ఇది శరీరంలో పెరిగి కీళ్ల నొప్పులు అలాగే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.చేపలు, చికెన్, మటన్, ఫౌల్ట్రీ, రెడ్ మీట్, చిక్కుళ్లు వంటి ఆహారాలు తీసుకోకూడదు.

Advertisement

ఎందుకంటే వీటిలో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి.వీటిని తినకుండా ఉంటే కీళ్ల నొప్పులు, కిడ్నీల సమస్యలు, చేతుల వాపు వంటి రోగాలు దరి చేరవు.

ఇక శరీరంలో యూరిక్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినకుండా ఉంటే మంచిది.నీళ్లను ఎక్కువగా తాగాలి.

యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గాలంటే నీళ్లను ఎక్కువగా తాగాలి.అప్పుడే మూత్రం తరచుగా వచ్చి యూరిక్ యాసిడ్లు తగ్గుతాయి.

అంతేకాదు తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమై, జీర్ణక్రియ పనితీరు బాగా మెరుగుపడుతుంది.అలాగే యూరిక్ యాసిడ్ తో బాధపడేవారు ఆల్కహాల్ ను తాగడం మానుకుంటే మంచిది.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?

ఎందుకంటే ఆల్కహాల్ ను తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది.దీనివల్ల శరీరంలో వ్యర్ధాలు అలాగే ఉండిపోతాయి.

Advertisement

కాఫీ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని అందరికీ బాగా తెలుసు.అయితే యూరిక్ యాసిడ్ తో బాధపడేవారు కాఫీని తాగకూడదు.ఎందుకంటే ఇది కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను పెంచుతుంది.

అందుకే దీన్ని తగినంత మోతాదులోనే తాగితే మంచిది.ఇలాంటి ఆహార పదార్థాలను కీళ్ల నొప్పుల తో బాధపడేవారు అస్సలు తీసుకోకూడదు.

తాజా వార్తలు