కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు ఈనెల 22న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.

 Cbi Notices To Kadapa Mp Avinash Reddy Once Again-TeluguStop.com

నిన్న తన తల్లి అనారోగ్యానికి గురి కావడంతో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాలేదు.ప్రస్తుతం ఆమె కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది.

ఈక్రమంలో విచారణకు హాజరుకావడానికి కొంత సమయం కావాలంటూ అవినాశ్ రెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చారు.ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి వినతిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఎల్లుండి విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube