ఆ థియేటర్ లో 200 రోజులు ఆడిన గుంటూరు కారం.. మహేష్ ఖాతాలో మరో రేర్ రికార్డ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ), హీరోయిన్ శ్రీ లీల ( Sri Leela )కలిసి నటించిన చిత్రం గుంటూరు కారం.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 270 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.

 Guntur Kaaram Movie Completed 200 Days In This Theatre, Guntur Kaaram, Theatre,-TeluguStop.com

ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో అంతకంటే ముందు పాటలు బాగా హిట్ అయ్యాయి.మరి ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి అనే సాంగ్ బాగా వైరల్ అయింది.

అంతేకాకుండా ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు ఒక రేంజ్ లో పెట్టుకున్నారు.

కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది.సినిమా విడుదల తర్వాత మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబట్టింది.ఈ చిత్రం వెంకటేశ్వర థియేటర్, చిలకలూరిపేటలో 200 రోజుల రన్ ను పూర్తి చేసుకుంది.డిజిటల్ ప్రీమియర్ గా వచ్చినప్పటికీ 200 రోజుల రన్ ను పూర్తి చేసుకోవడం సెన్సేషన్ అని చెప్పాలి మరి.ఈ చిత్రానికి బదులుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నేటి నుండి ప్రదర్శింపబడునుంది.

అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నిజమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ అభిమానులు సూపర్ స్టార్ మహాష్ బాబు నిజంగా గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే మహేష్ బాబు విషయానికి వస్తే.

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube