Niti Taylor Parth Samthaan : బుల్లితెర నటుడితో ప్రేమలో పడిన తనీష్ హీరోయిన్?

టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ సరసన కథానాయికగా నటించింది నితి టేలర్.త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన మేం వయసుకు వచ్చాం చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది.

 Niti Taylor Dating Rumors With Parth Samthaan, Kaisi Yeh Yaariaan,parth Samthaan-TeluguStop.com

ఆ సినిమాలో నీతి అందచందాలు నటనకు తెలుగు యువత మైండ్ బ్లాక్ అయ్యింది.కానీ ఈ మోడల్ కం బుల్లితెర నటికి ఆ తర్వాత తెలుగులో ఆశించినన్ని అవకాశాలు రాలేదు.

అడపాదడపా కొన్ని సినిమాలలో నటించినా విజయాలు దక్కలేదు.అదే క్రమంలో ప్రస్తుతం హిందీ బుల్లితెరపై కెరీర్ ని వెతుక్కుంది.

అక్కడ డ్యాన్స్ రియాలిటీ షోలు.వెబ్ షోలతో బిజీఅవుతోంది.

అంతేకాదు.ఈ బ్యూటీ ప్రస్తుతం కోస్టార్ తో డేటింగ్ చేస్తోందని ప్రచారం సాగుతోంది.సదరు బుల్లితెర నటుడితో జోరుగా ప్రేమాయణం సాగిస్తోందని ఆ ఇద్దరి నడుమా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఒక రేంజులో పండిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.తాజాగా నితి నటించిన ‘కైసీ యే యారియాన్ 4’ వీడియో క్లిప్ ఒకటి లీక్ అయింది.

ఇందులో నటుడు పార్థ్ సమతాన్ – నితి టేలర్ నడుమ స్టీమీ సీన్ ఓ రేంజ్ లో ఉంది.ఆ ఇద్దరి నడుమా కెమిస్ట్రీ చూశాక అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

కైసీ యే యారియాన్ అనేది శాశ్వత అభిమానుల సంఖ్యను కలిగి ఉన్న ఒక రియాలిటీ షో.ఇప్పుడు సీజన్ 4 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇది డిసెంబర్ 4 నుంచి వూట్ లో స్ట్రీమింగ్ కానుంది.పార్త్ సమతాన్ – నితి టేలర్ ల లీక్డ్ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.ఈ వీడియోలో వేడెక్కించే దృశ్యాన్ని చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు.రీల్ జోడి కెమెరా ముందు కూడా ఎంతో సన్నిహితంగా ఒకరికొకరు చాలా సౌకర్యంగా ఉన్నారని నిరూపించారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇది మొదటి ముద్దు అయినా లేదా అందమైన క్షణమైనా.అభిమానులు ఈ కొత్త జంటను ఆరాధిస్తున్నారు.

ఈ జంట ఒక ఇంటి వాళ్లవ్వాలని కోరుకునే అభిమానులు కూడా ఉన్నారు.

మేం వయసుకు వచ్చాం ఫేం నీతి టేలర్ సాహసాల గురించి కూడా ఇప్పుడు అభిమానుల్లో చర్చ సాగుతోంది.

తాజాగా తన ఇన్ స్టా వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది.ఇందులో సహనటుడితో నీతి అద్భుతమైన డ్యాన్సింగ్ విన్యాసాలు అథ్లెటిక్ ఫీట్స్ తో అదరగొడుతోంది.

చాలా గట్సీ పెర్ఫామెన్స్ తో మైమరిపిస్తోంది.కలర్స్ చానెల్ లో పాపులర్ రియాలిటీ షో ఝలక్ దిక్ లాజాలో నితి తన ప్రదర్శనతో ఇలా మైమరిపించింది.

టెలివిజన్ షో కైసీ యే యారియాన్ మన దేశంలోనే కాకుండా.వేరే దేశాలలోని ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్న షో.అయితే పార్థ్ సమతాన్ ప్రజలు చాలా ఇష్టపడుతారు.వీరిద్దరు విడిపోయారని ప్రేక్షకులు అనుకున్నప్పటికి వారి కెమిస్ట్రీ చూస్తే అలా లేదని అనుకుంటున్నారు ప్రజలు.

రొమాంటిక్ గా డాన్స్ లు చేయడం, వారి సంభాషణలు వీరి మధ్య ఏదో ఉంది అనేలా క్రియేట్ చేస్తాయి.అయితే పార్థ్ సమతాన్ ఇంక నితి టేలర్ గతంలో కంటే ఇప్పుడు మరింత ప్రీగా ఉన్నారని వారి వీడియోలో తెలియజేస్తున్నాయి.

అయితే ఈ షో డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ కార్యక్రమం Vootలో ప్రసారం కానుంది.గత సీజన్ OTTలో కూడా అందుబాటులో ఉంది.2014 నుంచి ఈ షోకు అభిమానులు కోకొల్లాలుగా ఉన్నారు.అందరి ఆదరాభిమానాలు పొందుతూ.

షో ఇంకా ముందుకు దూసుకుపోతూనే ఉంది.అయితే ఆ షోలో ఈ జంటనే అందరికి చాలా ఇష్టం అని కామెంట్లు కూడా వస్తున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube