కీర్తి సురేష్( Keerthy Suresh ).స్వతహాగా మలయాళీ అయినప్పటికీ నటించే ఏ భాషలోనైనా పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న హీరోయిన్.
చిన్నతనం నుంచే నటిస్తున్న కీర్తి సురేష్ 2013లో మొదటిసారి హీరోయిన్ గా నటించింది.తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్ తెలుగులో 2015 లో రామ్ పోతినేని( Ram potheneni ) హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో పరిచయం అయింది.
ఆ సినిమా తర్వాత ఆమె 2017 లో నేను లోకల్ అనే చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత మహానటి చిత్రంలో తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు దక్కించుకుంది.
మన్మధుడు 2, రంగ్ దే, గుడ్ లక్ సఖి వంటి సినిమాల్లో నటించిన ఆమెకు సర్కారీ వారి పాట మంచి పేరు తీసుకువచ్చింది.
ఇప్పుడు నాని( Nani )తో మరోసారి దసరా సినిమా కోసం జోడి కట్టిన కీర్తి సురేష్ ఈ చిత్రానికి తన నటనే హైలెట్ గా ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు.అయితే నానితో నటించడం రెండు సినిమాలే అయినప్పటికీ కీర్తి సురేష్ ని నాని మొదటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు.సినిమాలకు అన్న కూడా నాని మరియు కీర్తి సురేష్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది అందుకే ఆమెను మహానటి సినిమా కోసం నానినే రిఫర్ చేశాడు.
అందువల్లే ఆమె మహానటిగా సౌత్ ఇండియాలో ప్రతి ఒక్కరి చేత గుర్తించబడింది.నాని ఒకసారి ఎవరితో అయినా స్నేహం చేశాడు అంటే వారితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు అందుకు ఉదాహరణ నివేదా థామస్( Niveda Thomas ).నీవే నాతో కూడా నానికి మంచి స్నేహం ఉంది అందుకే ఆమెను ప్రతి సినిమాలో కూడా తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.
నాని స్వయంగా నిర్మించిన సినిమాలో కూడా నివేదాకు మంచి అవకాశం ఇచ్చాడు ఇలా నాని కీర్తి సురేష్ నివేద లాంటి హీరోయిన్స్ ని మొదటి నుంచి ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు.ఇక దసరా( Dussehra ) సినిమాలో అయితే నానిని కీర్తి సురేష్ డామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది ఆమె తన నటనతో అచ్చ తెలుగు తెలంగాణ యాసను నరాల్లో జీవించుకున్నట్టుగా నటించింది అని నటిజన్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు ఇదే విధంగా మరికొన్ని నేలపాటు ఆమె నటిస్తే స్టార్ హీరోయిన్గా మాత్రమే కాదు ఎంతో గొప్ప ఉత్తమ నటిగా కీర్తి సురేష్ పేరు సంపాదించుకోవడం ఖాయం.