1. తెలంగాణ గవర్నర్ పరామర్శ
నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం తెలంగాణ గవర్నర్ తమిళ సై పర్యటించారు.కుటుంబ నియంత్రణ ఆపరేషన్ బాధితులను గవర్నర్ పరామర్శించారు.
2.శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా పెరిగింది.
3.దళిత బందుపై మంత్రి కొప్పుల సవాల్
దళిత బంధుపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని , తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.దమ్ముంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేయాలని సవాల్ విసిరారు.
4.నాగార్జునసాగర్ కు వరద
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.దీంతో క్రస్ట్ గేట్లు ఎనిమిది ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
5.కేసీఆర్ వల్లే రైతు ఆత్మహత్యలు
సీఎం కేసీఆర్ వల్లనే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ విమర్శించారు.
6.ఏ ఎంవీఐ నోటిఫికేషన్ రద్దు
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నియామకాలకు బ్రేక్ పడింది అభ్యర్థుల అర్హతలు విషయంలో స్పష్టత గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేశారు.
7. చేప పిల్లల పంపిణీ
ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల ఐదు నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
8.అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులే
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు మూడు రోజులపాటు జరగనున్నాయి.6 ,13, 14వ తేదీల్లో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
9. భారత్ లో కరోనా
గడిచిన 24 గంటలు దేశవ్యాప్తంగా కొత్తగా 8,414 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
10.నూజివీడు ట్రిపుల్ ఐటీ లో అధ్యాపకుల నిరసన
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో రెండో రోజు కూడా ఉద్యోగులు నిరసన కొనసాగించారు.
11.శ్రీలంక అధ్యక్షుడికి నిత్యానంద లేఖ
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే సహాయాన్ని కోరాడు.తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన శ్రీలంక రాజకీయ ఆశ్రయం కోరుతున్నారు.
12.కాంగ్రెస్ భారీ ర్యాలీ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టారు.
13.కేంద్ర మంత్రి పర్యటన
ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ పర్యటించనున్నారు.
14.తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ నిరుద్యోగులకు టిఎస్ పీఎస్సి శుభవార్త చెప్పింది.1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
15.ఏపీ బీజేపీ అధ్యక్షుడు విమర్శలు
ఏపీ పోలీసులు ప్రభుత్వానికి తాబేదారుల అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమ వీర్రాజు ప్రశ్నించారు.ఏపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పోలీసు వ్యవస్థ ఎందుకు దిగజారిపోయింది అని వీర్రాజు ప్రశ్నించారు.
16.గులాం నబి ఆజాద్ నేడు కొత్త పార్టీ
కాంగ్రెస్కు రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నాభి ఆజాద్ ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో జరగబోయే భారీ ర్యాలీలో కొత్త పార్టీ ప్రకటించనున్నారు.
17.రేవంత్ రెడ్డి కామెంట్స్
చదువు చెప్పమంటే సర్కార్ చంపుతోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.బాసర ట్రిపుల్ ఐటి లో విద్యార్థులు గోసపడుతున్నారని, అన్నంలో పురుగులు, కిచెన్ లో స్నానాలు ,అడుగున ఆంక్షలు ఉన్నాయని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
18.తుంగభద్ర ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తివేత
తుంగభద్ర ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతోంది.అధికారులు తుంగబద్ర ప్రాజెక్ట్ 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
19.ఏపీ మావోయిస్టు లపై అభియోగాలు
ఏపీకి చెందిన ఇద్దరు మావోయిస్టు లపై కేరళ కోర్టు లో ఎన్.ఐ.ఏ అభియోగాలు దాఖలు చేసింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -46,650 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,890
.