జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి గురించి మనందరికీ తెలిసిందే.అయితే జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్పి అదే జబర్దస్త్ షో గురించి అక్కడ పనిచేస్తున్న వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే.
మరి ముఖ్యంగా చెప్పాలి అంటే కమెడియన్ గా కంటే ఈ రెండు వారాలలోనే కిరాక్ ఆర్పి బాగా ఫేమస్ పాపులర్ అయ్యాడు అని చెప్పవచ్చు.జబర్దస్త్ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి పై ఇప్పటికే షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మరొకసారి రెచ్చిపోయాడు కిరాక్ ఆర్ పి.అయితే భారతదేశం గర్వించే దగ్గర నిర్మాత అయిన ఎమ్మెస్ రెడ్డి కడుపున పుట్టిన శ్యాం ప్రసాద్ రెడ్డి తండ్రి అంటే విలువలేదు అంటూ వ్యక్తిగత విమర్శలు చేశాడు ఆర్పి.
తాజాగా మరొకసారి మీడియా ముందుకు వచ్చిన కిరాక్ ఆర్పీ శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయనకి సవాల్ విసిరాడు.నన్ను అభిమానించే వాళ్లకి చెప్తున్నా నేను ఎప్పుడూ తప్పుచేయలేదు.
ఎందుకంటే కష్టం విలువ నాకు తెలుసు నేను ఇండస్ట్రీలో ఎదగడానికి వచ్చి మొదట్లో అన్నపూర్ణ హోటల్లో బాత్ రూమ్ లు కడిగాను.అబిడ్స్ అన్నపూర్ణ హోటల్లో బాత్ రూంలు కడిగా అంతే కాకుండా ఆఫీస్ బాయ్గా పనిచేశాను.
మోరీ పనిచేశాను తుడిచే పని చేశాను మందుపోసే పనిచేశాను.వాళ్లకి మందు ఎక్కువైనప్పుడు వాళ్ళతో తన్నించుకున్నాను వాళ్లు కక్కితే తుడిచాను నేను ఇప్పుడైనా సరే అన్నీ వదిలేసి వెళ్లి సులభ్ కాంప్లెక్స్లు కడుక్కుంటా నేను బాత్ రూంలు కడిగినట్టు ప్రపంచంలో ఎవరూ కడగలేరు నేను బాత్ రూంలు కడుగుతా మీరు మీ మనసుల్ని కడుక్కోండి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు కిరాక్ ఆర్పి.
అయితే ఇప్పుడు నేను శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి సవాలు చేసి చెబుతున్నాను తొక్కేస్తారు అని అంటున్నారు కదా.తొక్కేస్తున్నారు అని తెలిసినప్పుడు తొక్కకుండా చేసుకోవడమే కదా మనిషి గొప్పతనం.ఇంకో సవాల్ విసురుతున్నాను.ఈరోజు నిజాయితీగా నిర్భయంగా చెప్తున్నా.నేను సినిమా తీస్తే ఆపుకో.నేను వెబ్ సిరీస్ తీస్తే ఆపుకో.
నా యూట్యూబ్ ఛానల్ని ఆపుకో.బాంచత్ అవసరం అయితే నా ఊపిరి ఆపుకో.
నన్ను లేపేయడానికి ప్లాన్ వేసుకో.మా ఇంట్లో ఎవరూ బౌన్సర్లు లేరు.
నువ్ ఎప్పుడైనా రా.నన్ను చంపుకో.నీయమ్మా.సరైన శత్రువు చేతిలో చనిపోవడంకంటే గొప్ప వరమా? నిజాయితీగా ప్రశ్నించాడు.శత్రువు చేతిలో చనిపోయాడనిపించుకుంటాను మాటలతో చెలరేగిపోయాడు కిరాక్ ఆర్పి.
అంతే కాకుండా నేను చనిపోయిన సమాధిలో నుంచే ప్రశ్నిస్తాను,సమాధి నుంచే సమాధానం ఇస్తాను.నేను ఇండస్ట్రీలో ఎవర్నీ ప్రశ్నించలేదు.జబర్దస్త్లో ఎవరిపైన ప్రశ్నించలేదు కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డినే ప్రశ్నిస్తున్నా నేను పర్శనల్ విషయాలు మాట్లాడటం లేదు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్లోకి వెళ్లానా? వాళ్ల ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడానా? బానిస బతుకుల బానిస మెతుకులు గురించే మాట్లాడుతున్నా ఆ మెతుకులు తిన్న ప్రతిఒక్కడూ బానిసలే అంటూ ఇప్పటివరకు శ్యాం ప్రసాద్ రెడ్డి పై అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై తనకున్న కోపాన్ని అంతా వెలగక్కస్తున్నాడు కిరాక్ ఆర్పి.