కంగనా రనౌత్. ఈ పేరు తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.
ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది.బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఈమె సుపరిచితమే.
ఈమె నటన పరంగా ఎవ్వరు వేలెత్తి చూపించేలేరు.అయితే బయట మాత్రం అన్ని విషయాల్లో కల్పించుకుని ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
అందుకే ఈమెను ఫైర్ బ్రాండ్ అంటారు.టాప్ హీరోలను అయినా సరే ముచ్చెమటలు పట్టించగల సత్తా ఉంది.ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వరుస హిట్స్ కొట్టి టాప్ హీరోయిన్ గా కొనగడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది.అయితే ఈమెకు వరుస పరాజయాలు ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఈమె చేసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.
ఈ మధ్యనే ఈ బ్యూటీ నటించిన ధాకడ్ పెద్ద ప్లాప్ ను మూటగట్టుకుంది.
జీరో ఆడియెన్స్ కారణంగా థియేటర్స్ లో ఈ సినిమాను రెండో రోజే తీసేసారు.
దీంతో ఈమెకు ఘోర పరాభవం ఎదురైంది.ఇక ఇప్పుడు ఈ అవమానాన్ని మరొక సినిమాతో మరిపించాలని తాపత్రయ పడుతుంది.తాజాగా ఈమె ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తుంది.
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా డైరెక్షన్, కథ అన్ని కూడా కంగనానే అవ్వడం విశేషం.
తాజాగా ఈ సినిమా నుండి ఆమె విడుదల చేసిన అనౌన్స్ మెంట్ టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో కంగనా ఇండియన్ శక్తివంతమైన లేడీ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది.ఈ టీజర్ లోనే ఈమె లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా చూపించి అదిరిపోయే డైలాగ్ తో ఈ టీజర్ ముగియగా.
ఈమె నటన మరోసారి అందరిని కట్టిపడేసింది.ఈ సినిమా 1975లో యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై రేణుపిట్టి, కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.