ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా నటించిన లవ్ ఎంటర్టైనర్ మూవీ “రాధే శ్యామ్”. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా రిలీజ్ అయ్యి ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతీయ సినీ లోకాన్ని ఒక ఊపు ఊపేస్తోంది.అభిమానులు ఎంతో కాలం వేచి చూసిన తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా విడుదలై అన్నిచోట్ల మంచి టాక్ సంపాదించుకుంది.
రాధే శ్యామ్ సినిమా విడుదలయ్యే సమయానికి ఈ సినిమాకు పోటీగా వేరే ఏ సినిమా లేకపోవడంతో పైగా వారాంతం కావటం వల్ల సినిమాకు కలెక్షన్లు బాగా ఉన్నాయని సమాచారం.
ఏ సినిమాకు లేని విధంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో టికెట్లు ఫ్రీ బుకింగ్ జరిగాయని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు వెల్లడించారు.బాహుబలి తర్వాత మళ్లీ రాధే శ్యామ్ సినిమా ఆ స్థాయిలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులందరూ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా రాధే శ్యామ్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్ రాబట్టి రికార్డు సృష్టించింది.ఇటీవల ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా మీద తన అభిప్రాయాన్ని తెలియచేశారు.చిరంజీవి మాట్లాడుతూ ” రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ చాలా బాగా నటించాడు.
ఈ సినిమా క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంది.ఈ సినిమాలో ప్రభాస్ లుక్, కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి” అని చిరు వెల్లడించారు.