ఏపీ కి సంబంధించి కేంద్రం పై సీరియస్ అయిన వామపక్ష పార్టీల నేతలు..!!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వామ పక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.తాజాగా జరిగిన లెఫ్ట్ పార్టీల ఈ సదస్సులో పాల్గొన్న నాయకులు.

 Leaders Of Left Parties Who Are Serious About The Center Regarding Ap Modi, Cp-TeluguStop.com

ఎవరికి వారు తమ అభిప్రాయాలు తెలియజేశారు.ఈ నెల 21వ తారీకు విశాఖకి ప్రధాని మోడీ వస్తారని అంటున్నారు.

ఆ సమయంలో విభజన హామీలు ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఇక ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని కూడా హామీ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు స్పష్టం చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బడ్జెట్‌ లో పేదలకు అన్యాయం చేసి.కార్పోరేట్‌ కంపెనీలకు ఊడిగం చేశారు.

రైతులకు అందే నిధుల్లో కోత విధించారు.ఏపీకి తీవ్రంగా అన్యాయం చేశారు.

కరోనా కష్ట కాలంలో పేదలను వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు భారీగా నిధులు కేటాయించారు అంటూ కూడా వామపక్ష పార్టీల నేతలు బీజేపీ పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు.విభజన హామీలను నెరవేర్చకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు.

Leaders Of Left Parties Who Are Serious About The Center Regarding AP Modi, Cpi, Cpm, Bjp , Ramakrishna , Srini Vasa Rao, Railway Zone , Vishaka Steel Plant - Telugu Modi, Railway Zone, Ramakrishna, Srini Vasa Rao, Vishaka Steel

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube