యువ ఆటగాళ్లు క్రికెట్లో సంచలన రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు.వీళ్లు ఇప్పటివరకు ఎవరూ సాధించలేని అరుదైన రికార్డులను సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులను ఆశ్చర్య పరుస్తున్నాయి.
తాజాగా మరొక ఆటగాడు ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.షకీబుల్ గని అనే ఓ బిహార్ రంజీ ప్లేయర్ ఒక అరుదైన వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.
కొద్ది గంటల క్రితం జరిగిన ఓ ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో అతడు అరంగేట్రం చేశాడు.అయితే ఈ ఫస్ట్ మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి వావ్ అనిపించాడు.
ఇప్పటి వరకు ఒకే రంజీ మ్యాచ్ లో ఎవరూ కూడా ట్రిపుల్ సెంచరీ సాధించిన దాఖలాలు లేవు.దీంతో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా గని రంజీ క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.
ప్రస్తుతం ఇండియాలోని పలు ప్రముఖ స్టేడియంలలో రంజీ ట్రోఫీ 2021-22 సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా మిజోరంతో జరిగిన మ్యాచ్లో షకీబుల్ గని ట్రిపుల్ సెంచరీతో చెలరేగి పోయాడు.
అతడు 387 బాల్స్ లో 300 స్కోర్ చేసి తనకు తానే సాటి అని చెప్పకనే చెప్పాడు.ఈ మ్యాచ్లో ఈ యువ ప్లేయర్ 405 బాల్స్ ఆడి 341 పరుగులు కొట్టాడు.
ఇందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 ఫోర్లు, 2 సిక్స్లు ఉండటం విశేషం.ఓకే మ్యాచ్లో 56 గూగుల్ అంటే మామూలు విషయమా! పరుగులతో కాదు ఫోర్లతోనే ఆఫ్ సెంచరీ చేయడం అంటే ఇదేనేమో అని క్రికెట్ అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు.
విశేషమేమిటంటే రంజీ ట్రోఫీలో ఇదే ఫస్ట్ ట్రిపుల్ సెంచరీ అయ్యింది.
ఈ మ్యాచ్లో బిహార్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 686 పరుగులు చేసింది.ఈ మ్యాచ్లో గనితో పాటు బాబుల్ కుమార్ కూడా డబుల్ సెంచరీ చేసి భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.బాబుల్ 398 బాల్స్ లో 229 పరుగులతో చేసి నాటౌట్ గా నిలిచాడు.2018-19 రంజీ ట్రోఫీ సీజన్లో తన ఫస్ట్ మ్యాచ్లో యువ క్రికెటర్ అజయ్ రోహరా 267 పరుగులు చేశాడు.ఇప్పటివరకు అదే అత్యధిక స్కోర్ కాగా ఇప్పుడు అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా షకీబుల్ గని అవతరించాడు.