టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారెవ్వరు లేరు.ప్రస్తుతం రీ ఎంట్రీ తో ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
వరుసగా స్టార్ డైరెక్టర్ ల సినిమాలకు ఓకే చెప్పాడు.ఈ ఏడాది విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.
ఇక పూరి జగన్నాథ్ తో కూడా ఓ సినిమా ప్రకటించగా.ఆ సినిమాకు ఓ స్టార్ నిర్మాత పేరు వినిపిస్తుంది.
ప్రస్తుతం పవన్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.అంతేకాకుండా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.
ఇక ఇవే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మన సినిమాకు సైన్ చేశాడు పవన్.డైరెక్టర్ రమేష్ వర్మ తో కూడా మరో సినిమాకు ఓకే అన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలను పూర్తి చేయడానికి 40 రోజులకు అటు ఇటు గా డేట్స్ కూడా ఇచ్చాడట పవన్.
ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పవర్ఫుల్ సినిమాలో నటించనున్నాడు పవన్ కళ్యాణ్.
నిజానికి ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబును అనుకోగా.మొత్తానికి ఇది పవన్ కి దక్కింది.
ఇక ఈ సినిమాకు జనగణమన అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.ఇదివరకే వీరి కాంబినేషన్ లో పలు సినిమాలు రాగా మంచి సక్సెస్ లు అందుకున్నాయి.
ఇక తాజాగా మళ్ళీ వీరి కాంబినేషన్ లో సినిమా ఉండటంతో అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా కథ కూడా విన్నాడట పవన్.దీంతో పవన్ కి ఈ సినిమా కథ కూడా నచ్చింది.ఇక ఈ సినిమాకు టాలీవుడ్ కి చెందిన టాప్ నిర్మాతను సెట్ చేసినట్లు తెలుస్తుంది.
ప్రముఖ నిర్మాత టాగోర్ మధు ఈ సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.ఇక మధు ఈ సినిమాకు క్లారిటీ ఇస్తే త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.