కోవిడ్ పోరులో ముందడుగు వేసిన టీటీడీ.. ఏం చేసిందంటే.. !

కరోనా పై జరుగుతున్న యుద్ధంలో ఒక్క ప్రభుత్వం పాల్గొంటే సరిపోదు.ఇది అందరు సమిష్టిగా కలిసి పోరాడవలసిన బయో వార్ ఎన్ని సంస్దలు స్వచ్చందంగా ఈ యుద్ధంలో పాల్గొంటే అంత త్వరగా ఈ వైరస్‌ను పారద్రోల వచ్చు.

 German Hangers For The Covid Victims Treatment On Ttdadvances, German Hangers, C-TeluguStop.com

ఒక ప్రణాళిక ప్రకారం సంపన్నులతో పాటుగా వివిధ సంస్ధలు చేయూతనిస్తే గానీ ఆ పోరుకు శుభం కార్డ్ పడదు.

ఇకపోతే అశేష భక్తులను అలరించే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కరోనా పోరులో మరో అడుగు ముందుకేసారు ఇందులో భాగంగా రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స అందించే క్రమంలో 22 జర్మన్ హ్యాంగర్లు నిర్మణానికి రూ.3.52 కోట్లు మంజూరు చేసింది.ఈ మేరకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి నిన్న వీతికి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విశాఖ జిల్లాలో 4, అనంతపురం, కృష్ణా, గుంటూరుతో పాటు మరో జిల్లాలో మూడు చొప్పున, ప్రకాశం, కర్నూలు, మరో జిల్లాలో రెండు చొప్పున ఈ నిధులతో జర్మన్ హ్యాంగర్లు నిర్మిస్తారని టీటీడీ ఈవో పేర్కొన్నారు ఇకపోతే ఇప్పటికే తిరుపతిలోని శ్రీ పద్మావతి కొవిడ్ ఆసుపత్రి వద్ద జర్మన్ హ్యాంగర్ నిర్మించి కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఏది ఏమైనా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube