మన అమ్మ అని మన సొంత అమ్మను మరెవరిని అమ్మ అని పిలవం.కానీ తమిళనాడులోని అన్నా డీఎంకే నాయకులకు , ప్రజలకు అమ్మ అంటే ముఖ్యమంత్రి జయలలిత మాత్రమే.
అమ్మ భక్తీ గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది.కొందరు నాయకులు అమ్మ వస్తేనే తమ ఇంటిలో శుభ కార్యాలు జరుపుతారు.
అమ్మ రావడం లేదని తెలిస్తే చివరి నిమిషంలో కూడా కార్యక్రమాన్ని రద్దు చేసిపారేస్తారు.చేసిన ఏర్పాట్లు వృధా అయినా పట్టించుకోరు.
తమిళనాడులో అమ్మ భక్తీ అంతగా ముదిరిపోయింది.అమ్మ రావడంలేదని తెలియడంతో ఒక్క రోజే తొమ్మిది వివాహాలు ఆగిపోయాయి.
ఈ వివాహాల్లో ఒక మంత్రి కూతురి పెళ్లి కూడా ఉంది.ఈ వివాహాలు మొన్న జరగాల్సి ఉంది.
తేదీ ఎప్పుడో చాలా కాలం కిందటే ఫిక్స్ అయిపొయింది.అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
కానీ వరదల కారణంగా తాను రాలేక పోతున్నానని జయలలిత చెప్పడంతో వివాహాలు రద్దు చేసుకున్నారు.ఈ వివాహాల్లో జయలలిత చేయాల్సింది ఏమీ లేదు.
అయిదు నిమిషాలో, పది నిమిషాలో ఉండి వధూ వరులను ఆశీర్వదించి వెళ్ళడమే.తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి తన కూతురు వివాహం రెండోసారి రద్దు చేసుకున్నారు.
కూతురు వివాహం నిర్ణయించగానే అక్రమ ఆస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్ళారు.దీంతో వివాహం వాయిదా పడింది.
మళ్ళీ మొన్న ముహూర్తం నిర్ణయించి జయను పిలిచారు.ఈసారి వరదలు వచ్చాయి.
ఆమె రానిదే వివాహం చేయకూడదనే నియమం పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ రద్దు చేశారు.ఇంత మూఢ భక్తీ తెలుగువారికి లేదు .