విజనున్న సీఎంగా ప్రచారం చేసుకునే చంద్రబాబు.ఏపీలో అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచిపోయాయి.
వాస్తవానికి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు ఈ రెండున్నరేళ్లలో ఎన్ని విజయాలు సాధించారు? లోటు బడ్జెట్లోనూ ఎన్ని పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు? అని ఒక్కసారి ఆలోచిస్తే.చాలా చాలా తక్కువగానే విజయాలు నమోదయ్యాయని చెప్పకతప్పదు! ఇక, ఆయన అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన కారణమైన ఎన్నికల హామీల్లో దాదాపు సగం కూడా నెరవేర్చలేదనే టాక్ వస్తోంది.
దీంతో చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను.హిట్స్ తక్కువ.ఫ్లాప్స్ ఎక్కువ అని అనేస్తున్నారు చాలా మంది!!
రైతు, డ్వాక్రా రుణ మాఫీ సహా బంగారంపై రుణాలను కూడా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.అదేవిధంగా నిరుద్యోగులకు నెలనెలా భృతి కల్పిస్తామని చెప్పారు.
అయితే, ఈ హామీల్లో ఏ ఒక్కదానికి కూడా బాబు తన పాలనలో చోటు కల్పించలేదు.అదేవిధంగా భారీ ఎత్తున ఉద్యోగ కల్పన అంటూ బాబు చేసిన హడావుడి హడావుడిగానే ఉండిపోయింది.
దీంతో ఆయా హామీల అమలు కోసం ఎదురు చూసిన జనాలు విసుగెత్తి పోయారు.
కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని బాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు.
ఇది పెద్ద ఎత్తున రాష్ట్రంలో దుమారాన్ని రేపింది.ఉద్యమాలకు శ్రీకారం చుట్టించింది.
ఒకరకంగా చెప్పాలంటే.చంద్రబాబు కంటిపై కునుకులేకుండా చేసింది.
ఇక, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బాబు మరీ బెండ్ అయిపోయినట్టు కనిపిస్తోంది.ఎన్నికల సమయం సహా ఏడాది కిందటి వరకు ప్రత్యేక హోదా కావాల్సిందేనని, దీనికిగాను తాను ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని బాబు ప్రకటించారు.
అయితే, ఏడాది కిందట ఈ విషయలోనూ ప్లేట్ ఫిరాయించారు.
ఇక, భీమవరంలోని ఆక్వాప్రాజెక్టు విషయంలోనూ రైతుల గోడు పట్టకుండానే సీఎం వ్యవహరిస్తున్నరనే అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు.
అయితే, రాజధాని అమరావతి విషయంలో మాత్రమే బాబు దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.ఇక్కడ కూడా బాబును అపజయాలే వెంటాడుతున్నాయి.
ఎంతో గొప్పగా చేపట్టిన స్విస్ ఛాలెంజ్పై హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించేసరికి దాని నంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.సో.ఇలా బాబు రెండున్నరేళ్ల పాలన.విజయాలు తక్కువ.
విఫలాలు ఎక్కువగానే సాగింది.మరి రానున్న రెండున్నరేళ్లలో అయినా.
బాబు పాలన బాగుంటుందేమో చూడాలి.