తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలు తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజీబిజీగా గడుపుతున్నారు.ఈ తరుణంలో ఆ పార్టీ కీలక నేత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి ఆయన కీలక కామెంట్లు చేశారు.ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తేస్టునే ఉంటాం.
టీడీపీ – బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది అని, ఇదే సందర్భంలో ఆయన ఆరోపణలు చేశారు.ప్రత్యేక హోదా 5 కోట్లు ఏపి ప్రజల హక్కు అంటూ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
ప్రత్యేక హోదా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ముగిసిన అధ్యాయం పనిచేసిన కామెంట్లకు వై.వి.సుబ్బారెడ్డి ఈ విధంగా కౌంటర్లు వేశారు.ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.
ప్రత్యేక హోదా పై వైసీపీ కట్టుబడి ఉంది అని మరోసారి గుర్తు చేశారు.ఒక ప్రత్యేక హోదా మాత్రమే కాదు రైల్వే జోన్, నిధులు కేటాయించే విషయం పోలవరం జాతీయ ప్రాజెక్టు కు సంబంధించి నిధుల విషయంలో గానీ… పార్లమెంటు సాక్షిగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వైసిపి కట్టుబడి ఉందో, ఇప్పుడు అదే రీతిలో కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు.
ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మళ్లీ స్పెషల్ స్టేటస్ చుట్టూ తిరుగుతూ ఉండటం విశేషం. <
.