స్వామిరారా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సుధీర్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.విభిన్నమైన కథలను తెరకెక్కించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ డైరెక్టర్ కి కూడా ఇప్పటి వరకు సరైన హిట్ లేదని చెప్పాలి.
ఈ క్రమంలోనే రణరంగం చిత్రం భారీ డిజాస్టర్ ని ఎదుర్కోవడంతో ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వరుస చిత్రాలతో సుధీర్ వర్మ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే రెజీనా కాసాండ్రా – నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో ”శాకినీ ఢాకినీ” అనే లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అలాగే మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర చిత్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇటీవల ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఘనంగా ప్రారంభించారు.
ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించిన ఈ చిత్రం రెండవ షెడ్యూల్ నుంచి రవితేజ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
గతంలో సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన కేశవ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మించారు.తాజాగా రావణాసుర చిత్రాన్ని కూడా అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటివరకు ఒక సరైన హిట్ తన ఖాతాలో వేసుకొని సుధీర్ వర్మ ఈసారి రవితేజ సినిమాతో అయినా మంచి విజయాన్ని అందుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ చిత్రం ద్వారా సుధీర్ వర్మ హిట్ కొడతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.