భారత్తో వచ్చే నెల 6 ప్రారంభం కానున్న వన్డే, టీ20 సిరీస్కు వెస్ట్ ఇండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.కీరన్ పొలార్డ్ వన్డే, టీ20 జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
ఇక తొలి మ్యాచ్ టీ20 హైదరాబాద్లో డిసెంబరు 6న జరగనుండగా, 8న తిరువనంతపురంలో రెండో టీ20, 11న ముంబైలో చివరిదైన మూడో టీ20 జరగుతుంది.ఆ తర్వాత చెన్నైలో 15న తొలి వన్డే, 18న వైజాగ్లో రెండో వన్డే, 22న కటక్లో మూడో వన్డే జరగనుంది.
వన్డే జట్టులో కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, సునీల్ ఆంబ్రిస్, షిమ్రన్ హెట్మెయిర్, నికొలస్ పూరన్, బ్రాండన్ కింగ్, కీమోపాల్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, హెడెన్ వాల్ష్ జూనియర్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, కారీ పియర్రీ, షెల్డన్ కాట్రెల్ ని ఎంపిక చేశారు.ఇక టీ20 జట్టు కోసం కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, లెండిల్ సిమన్స్, ఫాబియన్ అలెన్, షిమ్రన్ హెట్మెయిర్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్, బ్రాండన్ కింగ్, కెస్రిక్ విలియమ్స్, రూథర్ ఫర్డ్, కీమోపాల్, షెల్డన్ కాట్రెల్, హెడెన్ వాల్ష్ జూనియర్, దినేశ్ రామ్దిన్, కారీ పియర్రీని ఎంపిక చేశారు.
మరి ఈ టీమ్ లు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న భారత్ ని ఎలా ఎదుర్కొని నిలబడతాయి అనేది చూడాలి.
.