వారికి క్షమాపణలు చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఎందుకంటే.. ?

ముంబయిలోని కోవిడ్ 19 ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.కాగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల ప్రాంతంలో భందూప్ ‌లోని డ్రీమ్స్ మాల్ సన్‌రైజ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు వెల్లడించారు.

 Uddhav Thackeray Apologizes To The Victims Died In Hospital Fire Accident ,  Mum-TeluguStop.com

ఇకపోతే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ప్రమాద సమయంలో హాస్పిటల్‌లో 76 మంది కోవిడ్ రోగులున్నట్లు తెలియచేశారు.

కాగా ఈ ప్రమాదానికి గల కారణం తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

ఇక ఈ ప్రమాదం సంభవించిన నేపధ్యంలో, అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారిని క్షమించమని వేడుకున్నారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.

కాగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube