టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా తన మెలోడీ అండ్ మాస్ సాంగ్స్ తో మరో ట్రెండ్ సెట్ చేశారు.
అయితే కాలం వేటలో మనోళ్ల కెరీర్ ఒక్కసారిగా గాయపడింది.సక్సెస్ తో కోలుకోవాలని ఇస్మార్ట్ శంకర్ ట్రీట్మెంట్ కి సిద్ధమవుతున్నారు.
సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో గాని సినిమాలో పని చేసిన చాలా మందికి సినిమా ఇజ్జత్ కి సవాల్ అన్నట్లు ఉంది.గత కొన్నేళ్లుగా అపజయాలతో సతమవుతున్న పూరి మళ్ళీ స్టార్ హీరోలతో వర్క్ చేయాలన్నా.అలాగే మణిశర్మ బిగ్ ప్రాజెక్ట్స్ కి ట్యూన్స్ చేయాలన్నా.ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వల్సిందే.అదే విధంగా హీరో రామ్ కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.
సక్సెస్ రేట్ దారుణంగా పడిపోవడంతో కెరీర్ ను కాస్త ఈ సినిమా ద్వారా సక్సెస్ ట్రాక్ లోకి నెట్టాలని చూస్తున్నాడు.
ఛార్మి సైత నిర్మాతగా సెట్టవ్వలని ఈ సినిమాపై పెట్టుబడి గట్టిగానే పెట్టింది.ఇక హీరోయిన్స్ నాభ నటేష్ – నిధి అగర్వాల్ లు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
మరి ఈ సినిమా వీళ్లందరి కెరీర్ కి ఎలాంటి యూ టర్న్ ఇస్తుందో చూడాలి.