మిస్ ఇండియా పోటీలలో పాల్గొని అక్కడి నుంచి బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి మొదటి సినిమా రామన్ రాఘవ్ లాంటి క్రైమ్ సినిమాలో నటించి సత్తా చాటిన తెలుగమ్మాయి శోబిత దూలిపాళ్ళ.ఈ అమ్మడు ఓ వైపు మోడలింగ్ రంగంలో దూసుకుపోతూ మరో వైపు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో సత్తా చాటుతుంది.
అయితే బాలీవుడ్ లో సక్సెస్ అయిన చాలా కాలం తర్వాత ఈమె గూఢచారి సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో ఒకే అనిపించుకున్న ఈ అమ్మడుకి తెలుగు దర్శక, నిర్మాతల నుంచి పెద్దగా ఆఫర్లు రాలేదు.
అయితే తనకి లైఫ్ ఇచ్చిన బాలీవుడ్ లో మాత్రం శోభితకి మంచి డిమాండ్ ఉంది.ఇక బాలీవుడ్ భామలకి ఏ మాత్రం తీసిపోకుండా హాట్ ఫోటో షూట్ లతో, అంగాంగ ప్రదర్శన చేయడానికి సైతం శోభిత సై అంటుంది.
అందుకే ఈమెకి అక్కడ మంచి డిమాండ్ ఉంది.ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా ఈమెకి మంచి అవకాశాలు వస్తున్నాయి.
గూఢచారి తర్వాత మరో అడవి శేష్ తోనే తెలుగు సినిమాలో శోభిత జత కడుతుంది.ఇదిలా ఉంటే ఈ భామ సౌత్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఊహించని విధంగా అవకాశం సొంతం చేసుకుంది.
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ లో శోభితకు ఛాన్స్ దక్కినట్లుగా తెలుస్తోంది.సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు శోభితని ఓ కీలక పాత్ర కోసం మణిరత్నం ఎంపిక చేసారని టాక్.
సౌత్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించబోతున్నారు.ఈ సినిమాలో అవకాశం సొంతం చేసుకోవడం ద్వారా శోభిత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఈ సినిమా తర్వాత అయిన ఈ తెలుగమ్మాయి సత్తాని మన దర్శకులు గుర్తిస్తారేమో చూడాలి.