జోగిని పెళ్లి రవీందర్రావు ఆశీస్సులు తీసుకున్న సర్పంచ్ రమేష్( Sarpanch Ramesh ).రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామ సర్పంచ్ రమేష్ జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు ఆశీస్సులు తీసుకున్నారు .
రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపెళ్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో తడగొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ నా యొక్క జన్మదిన పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణ కాపాడాలని కోరారు.
నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.