సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ ఈర్ష్య పడేలా ఏ ఒక్క హీరోయిన్ కూడా సాధించలేని అద్భుతమైన ఘనతను నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సాధించింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బంగారు పతకాలను అందుకొని ఈమె రికార్డు సృష్టించారు.
నటన పరంగా సాయిపల్లవి కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ ఆమెకు అనుకూలంగా ఉండే పాత్రలను ఎంపిక చేసుకొని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకోవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.
తాజాగా నాని సరసన సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి దేవదాసి పాత్ర ద్వారా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించారు.
ఈ సినిమాలో ఈమె నటనకు గాను ఎంతో మంది చేత ప్రశంసలు అందుకున్నారు.ఇకపోతే తాజాగా ఈ పాత్రలో నటించినందుకు ఈమెకు బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుకలో భాగంగా తన నటనకు బంగారు పతకం లభించింది.
సాయి పల్లవి ఈ విధంగా బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుకలో బంగారు పతకం అందుకోవడం ఇది మొదటిసారి కాదు ఇదివరకే ఈమె రెండు సార్లు బంగారు పథకాలను అందుకుంది.2017 లో సాయి పల్లవి నటించిన కాళి సినిమాకు, అలాగే 2019 లో మలయాళంలో ఫహద్ ఫాసిల్ తో కలిసి నటించిన అథిరన్ సినిమాకుగాను బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుకలో సాయి పల్లవి బంగారు పతకం దక్కించుకుంది.ముచ్చటగా మూడోసారి శ్యామ్ సింగరాయ్ సినిమాకి కూడా ఈమె బంగారు పతకం అందుకోవడం గమనార్హం.ఇలా వరుసగా మూడు బంగారు పతకాలు రావడంతో ఈమె అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.