ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం ఆగస్టు 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ చిత్రంను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ, కన్నడం మరియు మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు.
అన్ని భాషల్లో కూడా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను రిచ్గా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మొదటగా తెలుగులో ఆడియో విడుదల వేడుక ప్లాన్ చేస్తున్నారు.ఆగస్టు 17వ తేదీన ఎల్బీ స్టేడియంలో అత్యధిక ప్రేక్షకుల మద్య నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఎల్బీ స్టేడియంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరు అయ్యే అవకాశం ఉంది.
ఎల్బీ స్టేడియంలో సినిమా వేడుకలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల సినిమా వేడుకలను అక్కడ నిర్వహిస్తూ ఉంటారు.
ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పాటు ఇంకా పలువురు స్టార్స్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.
సాహో చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్లు నిర్మించారు.
బాహుబలి స్థాయిలో ఈ చిత్రం ఉండాలనే ఉద్దేశ్యంతో హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ను ఈ చిత్రం కోసం ఉపయోగించారు.ఇక ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్పై కనిపించని అద్బుతమైన విజువల్స్ ఈ చిత్రంలో ఉంటాయంటూ, యాక్షన్ సీన్స్ విషయంలో హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అంతటి సినిమాకు ఆడియో వేడుక ఎలా జరుగుతుందో ఒకసారి ఊహించుకోవచ్చు.