యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం సాహో.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇక ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి నిర్మాతలు రంగం సిద్ధం చేసుకున్నారు.ఇప్పటికే హిందీ రైట్స్ ని కూడా భారీ రేటుకి అమ్మేసారు.
ఇదిలా ఉంటే ఇక సినిమాని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకున్న నిర్మాతలకి సంగీత దర్శకుల త్రయం శంకర్- ఎహసాన్-లాయ్ షాక్ ఇచ్చి సినిమా నుంచి తప్పుకున్నారు.నిర్మాతలతో వచ్చిన విభేదాల కారణంగా తాము చేయలేమని సంగీత దర్శకులు చెప్పేశారు.
ఇక వాళ్ళు తప్పుకోవడంతో సాహో సినిమా సంగీతం కోసం చాలా మంది పేర్లు పరిశీలించి చిత్ర యూనిట్ ఫైనల్ గా మొదటిగా అనుకున్న జిబ్రాన్ ని ఫైనల్ చేసారు.ఇప్పటికే హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిన విశ్వరూపం సినిమాకి సంగీతం అందించిన అనుభవం జిబ్రాన్ కి ఉండటంతో కొంత కలిసి వచ్చింది.
దానికి తోడు దర్శకుడు సుజిత్ మొదటి సినిమాకి ఏరికోరి జిబ్రాన్ ని మ్యూజిక్ దర్శకుడుగా తెచ్చుకొని రన్ రాజా రన్ తోసూపర్ హిట్ కొట్టాడు.ఈ నేపధ్యంలో సుజిత్ ఇంటరెస్ట్ మేరకు జిబ్రాన్ ని నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
మరి హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఈ కుర్ర మ్యూజిక్ దర్శకుడు ఎ స్థాయిలో మ్యూజిక్ అందిస్తాడు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.