ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా గురించి పలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుండగా.
ఈ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు.అంతేకాకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది.
ఇక ఈ సినిమాలో మరో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించనున్నట్టు సమాచారం.కానీ ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ భారతీయుడు-2 సినిమాలో దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత చెర్రీ సినిమా మొదలు కానుందని తెలిసింది.
కానీ ప్రస్తుతం శంకర్ భారతీయుడు 2 సినిమా కోసం కొన్ని చిక్కుల్లో ఇరికాడు.
నిజానికి ఈ సినిమా మొదలైనప్పటి నుండే శంకర్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.శంకర్ కు, సినీ నిర్మాతలకు బడ్జెట్ విషయంలో ఒప్పందం సరిగ్గా కుదరకపోవడంతో.దాంతో శంకర్ అడిగినంత ఇవ్వలేదని.
ఇచ్చిన దాంట్లోనే సినిమా కంప్లీట్ చేయమని లైక నిర్మాతలు కోరారు.దీనివల్ల సినిమా మధ్యలో ఆగిపోగా.
ప్రస్తుతం ఈ విషయం గురించి కోర్టులో కేసు నడుస్తుంది.ఇక ఈ సినిమా పూర్తి కావడానికి మరో నాలుగైదు నెలలు పడే అవకాశం ఉందని.
అంతేకాకుండా ఈ ఏడాది ఆఖరులో కూడా ఈ సినిమా వచ్చే పరిస్థితి లేదనిపిస్తుంది.మరి దీనిని బట్టి ఈ సినిమా తర్వాతే చెర్రీ సినిమా ఉంటుంది కాబట్టి.
ఈ సినిమా ఆగిపోనుందా అనే ఆలోచనలు వస్తున్నాయి.