తేజ కొత్త 'చిత్రం'లో వారిద్దరు హీరోలు కారట.. మరెవ్వరు బాబు?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎన్నో సినిమాలను ప్రకటిస్తాడు ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా వదిలేస్తాడు.

ఎన్నో ప్రకటిస్తే అందులో కొన్ని మాత్రమే వర్మ తెరకెక్కిస్తూ ఉంటాడు.

అయితే ఎక్కువ మంది దర్శకులు అలా ఉండరు.ఒకటి రెండు సినిమాలు అప్పుడప్పుడు ప్రకటించి చేయకుండా వదిలేస్తారేమో కాని ఎక్కువ శాతం దర్శకులు మాత్రం ప్రకటించిన సినిమాలను ఖచ్చితంగా పూర్తి చేస్తారు.

కాని దర్శకుడు తేజ మాత్రం ఇప్పటి వరకు మూడు సినిమాలను ప్రకటించి అందులో కనీసం ఒక్క సినిమా ను అయినా పూర్తి చేయలేక పోయాడు.కనీసం ఆ మూడు సినిమాలను ప్రారంభించడం లో కూడా విఫలం అయ్యాడు.

తేజ దర్శకత్వంలో ఆ మద్య రాక్షస రాజు రావణుడు మరియు అలిమేలు మంగ వెంకట రమణ సినిమాలు ప్రకటన వచ్చాయి.ఆ తర్వాత చిత్రం 1.1 ను కూడా ప్రకటించాడు.కాని మూడు సినిమాలు కూడా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు.

Advertisement

కరోనా ఈయన సినిమాలకు అడ్డంగా నిలిచింది.

చిత్రం 1.1 సినిమా లో హీరోగా కొత్త కుర్రాడిని తీసుకు రాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.మొదట సురేష్‌ బాబు చిన్న కొడుకు అభిరామ్‌ ను హీరోగా చిత్రం 1.1 ను చేయబోతున్నట్లుగా చెప్పారు.కాని ఆ తర్వాత ఎన్టీఆర్‌ బామ్మర్థి అంటే లక్ష్మి ప్రణతి సోదరుడు హీరోగా చిత్రం 1.1 ను రూపొందించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.కాని అసలు విషయం ఏంటీ అంటే ఇప్పటి వరకు ఆ సినిమా కు హీరో ఎవరు అనేది ఫిక్స్ అవ్వలేదు.

నార్నే వారు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినా భారీ బడ్జెట్ ను కోట్‌ చేయడంతో వారు నో చెప్పారని తెలుస్తోంది.ఆ బడ్జెట్‌ తో స్టార్‌ డైరెక్టర్‌ తోనే సినిమాను చేయవచ్చు కదా అంటూ నార్నే వారు భావించారట.

అలా ఎన్టీఆర్‌ బామ్మర్ధి కూడా చిత్రం నుండి తప్పుకున్నాడు.దాంతో ఇప్పుడు ఆ సినిమా లో నటించబోతున్న కొత్త కుర్రాడు ఎవరై ఉంటారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు