కరోనా టీకా అని నమ్మించి మత్తు మందు ఇచ్చి.. ఇంత ఘోరమా.. ?

మోసం చేయడానికి కరోనా టీకాను కూడా వాడుతున్నారు మనుషులు.ఛీ ఇలాంటి సమాజంలో కలుపు మొక్కలు కాకుంటే ఇంకేం ఎదుగుతాయి.

 Private Nurse Cheating In The Name Of Covid Vaccine  Private Nurse, Cheating, Co-TeluguStop.com

ఇక అసలు విషయానికి వస్తే కరోనా టీకా అని నమ్మించి వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడిన ఓ నర్సు భాగోతం హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో వెలుగు చూసింది.

ఇకపోతే మీర్‌పేట పీఎస్‌ పరిధిలోని లలితనగర్‌లో కస్తూరి, లక్ష్మణ్ అనే దంపతులు నివాసముంటున్నారు.

కాగా లక్ష్మణ్ ఎలక్షన్‌ కమిషన్‌ స్టేట్‌ ఆఫీస్‌లో అకౌంటెట్‌గా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు.

ఈ క్రమంలో వారి వద్ద డబ్బు ఉన్న విషయం తెలుసుకున్న ఓ నర్సు, మొదట పాయసంలో మత్తు మందు కలిపి ఇచ్చిందట.

అయితే వారికి షుగర్‌ ఉండటంతో ఆ పాయసాన్ని పారబోశారట.తర్వాత ప్లాన్ చేంజ్ చేసిన ఆ కిలాడి నర్స్ కొవిడ్ వ్యాక్సిన్ అంటూ ఆ దంపతులకు మత్తు మందు ఇచ్చిందట.

దీంతో వారు స్పృహ కోల్పోవడంతో, వారి వద్ద ఉన్న 8 తులాల బంగారాన్ని చోరీ చేసి పారిపోయిందట.ఇక మత్తు నుండి కోలుకున్న ఆ దంపంతులు జరిగిన విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారట.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలు అనూషను అరెస్ట్ చేశారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube