విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) ప్రైవేటీకరణ అంశం ఏపీలో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.గత ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే విషయంలో దూకుడు ప్రదర్శించింది.
ఆ సమయంలోనే ఏపి నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి.ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల( AP Assembly Elections ) సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారం లోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని హామీ ఇచ్చారు.
![Telugu Ap Diputy Cm, Axhhenna, Janasena, Janasenani, Pavan Kalyan, Pawanreacts, Telugu Ap Diputy Cm, Axhhenna, Janasena, Janasenani, Pavan Kalyan, Pawanreacts,](https://telugustop.com/wp-content/uploads/2024/11/Pawan-reacts-on-the-privatization-of-Visakha-Steel-Plantb.jpg)
అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందని వైసీపీ( YCP ) నేతలు ఆరోపిస్తూ, ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు.తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని , అది అందరి కమిట్మెంట్ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ నడిపించే విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని, మైన్స్, స్కిల్స్ డెవలప్మెంట్ ( Mines, Skills Development )వంటి అంశాలలో సవాళ్లు ఎదురవుతున్నాయని పవన్ అన్నారు.
నెలరోజుల క్రితం కార్మికులతో తాను మాట్లాడానని, కార్మికుల సమస్యలకు సంబంధించి పూర్తి కార్యాచరణ రూపొందిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారితో చెప్పినట్లుగా పవన్ తెలిపారు.
![Telugu Ap Diputy Cm, Axhhenna, Janasena, Janasenani, Pavan Kalyan, Pawanreacts, Telugu Ap Diputy Cm, Axhhenna, Janasena, Janasenani, Pavan Kalyan, Pawanreacts,](https://telugustop.com/wp-content/uploads/2024/11/Pawan-reacts-on-the-privatization-of-Visakha-Steel-Plantd.jpg)
ఇక ఇదే విషయంపై మంత్రి అచ్చెన్న నాయుడు ( Minister Achenna Naidu )కూడా స్పందించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపుతామని స్పష్టంగా హామీ ఇచ్చామని అచ్చెన్న తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొదటి ఢిల్లీ పర్యటనలోనే ప్రధాని మోది, కేంద్రమంత్రి కుమారస్వామిలను కలిశారని, ఆ తరువాతే స్టీల్ ప్లాంట్ సందర్శనకు కుమారస్వామి వచ్చారని అచ్చెన్న గుర్తు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చిన కుమారస్వామి కార్మికులతో కూడా మాట్లాడారని , ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కార్మికులకు కుమార స్వామి హామీ ఇచ్చారు అనే విషయాన్ని అచ్చెన్న మరోసారి గుర్తు చేశారు.