తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ చలో రాజ్ భవన్కార్యక్రమం చేపట్టడంతో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదే సమయంలో ధర్నాచౌక్ నుండి రాజ్ భవన్ కి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడ.తో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ఈ క్రమంలో పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకోవడంతో రేవంత్ రెడ్డి ముందస్తుగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మా సహనాన్ని పరీక్షించవద్దు అంటూసీరియస్ వ్యాఖ్యలు చేశారు.అరెస్టులు నిర్బంధాలు చేస్తే ఊరుకోము, రాబోయే రోజుల్లో లక్షలాదిమంది రోడ్డు పైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు పెట్రోల్ డీజిల్ పనులు పెంచుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దౌర్జన్యం చేస్తున్నాయని.దోపిడీ చేస్తున్నయి అంటూ సీరియస్ కామెంట్లు చేశారు.ప్రజల కోసం ఎంత పోరాటానికైనా వెనుకాడబోమని ఈ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు.