సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఏదో ఒక పోస్ట్ పెడుతూ జనాల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్న నటుడు, జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాగబాబు మరోసారి ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనేది క్లారిటీ లేకున్నా దేశం మొత్తంలో ఓట్లు వేయకుండా ఓటింగ్కు దూరంగా ఉన్న వారిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశాడు.
ఎన్నికల సమయంలో ఓట్లు వేయకుండా దాక్కున్న వాళ్లు ఇప్పుడు మాకు అది లేదు ఇది లేదు ఆ సమస్య ఈ సమస్య అంటూ ముందుకు వస్తున్నారు.అలాంటి వారు ఇప్పుడు ఎలా మాట్లాడుతారు అనేది నాగబాబు ఉద్దేశ్యం.
కష్ట సమయం లో నాయకులు దాక్కున్నారు అంటున్నావ్, ఓటు వేసేటప్పుడు వెయ్యకుండా నువ్వెక్కడ దాక్కున్నావు? 40% ఓటు వేయని జనానికి ప్రశ్నించే హక్కు లేదు. అంటూ నాగబాబు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
ఎన్నికల సమయంలో బాధ్యత లేకుండా ప్రవర్తించిన వారు ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తున్నారు అంటూ నాగబాబు చేసిన ట్వీట్స్ను చాలా మంది సమర్థిస్తున్నారు.ఎన్నికల్లో ఓటు వేసి అప్పుడు మాట్లాడాలంటూ పలువురు కూడా అభిప్రాయ పడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో అయినా ఓటింగ్ శాతం పెరగాలనేది నాగబాబు అభిప్రాయం కావచ్చు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.