ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానన్న మెగాస్టార్ చిరంజీవి...

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతి చెందారు.దీంతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

 Megstar Chiranjeevi Will Always Be There To Support Ramaraos Family-TeluguStop.com

అయితే సినిమా వార్తలని బయట ప్రపంచానికి అందించడంలో తన వంతు పాత్ర పోషించి ఎంతో మందికి సహాయం చేసినటువంటి సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు మరణాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా రామారావు గారి మృతి పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అంటే తనకు ఎంతో అభిమానమని అంతేగాక అతడిని ఒక జర్నలిస్టుగా కాకుండా తన ఆత్మ బంధువుగా చూస్తానని చిరంజీవి అన్నారు.అరామారావుకి మా కుటుంబం అంటే ఎంతో అభిమానమని అందువల్లే తన కొడుకుకి కూడా తమ ముగ్గురి మెగా బ్రదర్స్ పేర్లు కలిపి చిరంజీవి నాగ పవన్ అని పేరు పెట్టారని అన్నారు.

అంతేగాక ఈ మధ్య కాలంలో గత కొద్దికాలంగా కొంత మేర అనారోగ్యంతో బాధపడుతున్నారని సన్ షైన్ ఆసుపత్రి వైద్యులను కూడా తన ఇంటికి పంపించి చూపించామని కానీ ఉన్నట్లుండి ఇలా అకాల మరణం చెందడంతో తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు.అలాగే సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 అంతేగాక జర్నలిస్టు రామారావు కుటుంబ సభ్యులకు ఏం అవసరం వచ్చినా తన వంతు సాయం చేస్తూ అన్ని వేళలా అండగా ఉంటానని మాట ఇచ్చారు.

Telugu Meg Chiranjeevi-Movie

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం వైఎస్ఆర్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో గ్లామర్ డాల్ త్రిష చిరంజీవి సరసన నటిస్తోంది.అంతేగాక ఈ చిత్రంలో కు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube