ఈనెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు కుజుడు కుంభరాశిలో( Aquarius ) సంచారం చేయబోతున్నాడు.ఈ రాశి వారికి కుజుడికి శత్రు క్షేత్రం పైగా తనకు పరమ శత్రువు అయిన శనీశ్వరుడితో కలిసి ఉండడం జరుగుతుంది.
ఈ రెండు గ్రహాల కలయిక సాధారణంగా కొన్ని రాశుల వారికి జీవితాల్లో తీవ్ర స్థాయి కష్టనష్టాలను సృష్టిస్తుంది.కానీ ఈసారి మాత్రం ఆరు రాశుల వారికి వృత్తి, ఉద్యోగాలపరంగా, ఆర్థికంగా బాగా మేలు జరుగుతుంది.అయితే ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం:
ఈ రాశి వారికి రాశాధిపతి కుజుడితో,( Kuja Graha ) లాభాధిపతి శనీశ్వరుడికి యుతి ఏర్పడడం వలన అనేక విధాలైన ఆర్థిక లాభాలు లభిస్తాయి.వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది.ఏ ప్రయత్నం చేసిన బాగా కలిసి వస్తుంది.
ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి.ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు కూడా ఏర్పడతాయి.
వృషభం:
ఈ రాశి వారికి దశమ స్థానంలో పాపగ్రహా యుతి ఏర్పడినందువలన వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కీలకమైన సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి.అలాగే అధికారం యుగానికి అవకాశం కూడా ఉంది.
కన్య:
ఈ రాశి వారికి ఆరవ స్థానంలో కుజుల సంచారం విపరీత రాజయోగాన్ని ఇస్తుంది.దీనివలన వీరి జీవితం అన్ని విధాలుగా రాజ లాగా గడిచిపోతుంది.
ధనస్సు:
ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఈ రెండు పాపగ్రహాల కలయిక వలన ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా విజయవంతం అవుతుంది.అలాగే వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి.అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగా కుదురపడుతుంది.
మకరం:
ఈ రాశాధిపతి శనీశ్వరుడు( Shaneeshwara ) ధనస్థానంలో ఉండడం, అక్కడ లాభాధిపతి కుజుడు కలవడం వలన ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది.భూ సంబంధమైన ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
కుంభం:
ఈ రాశికి నాథుడైన శనీశ్వరుడితో కుజుడి కలయిక వలన కొన్ని కీలకమైన వ్యక్తిగత కుటుంబ సమస్యలను పట్టుదలగా పరిష్కరించుకోవచ్చు.
DEVOTIONAL