పూజానంతరం పసుపు గణపతిని ఏం చేయాలి?

మనకు తెల్సినంత వరకు మనం ఏ పూజ చేసినా, ఎలాంటి వ్రతం చేసుకున్నా ముందుగా ఆ గణపతికే పూజ  చేస్తుంటాం.ముందుగా విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడికే పూజ చేయాలని వేద పండితులు చెబుతాంటారు.

 What To Do Pasupu Ganapathi After Complete Puja, Devotional, Pasupu Ganapathi, T-TeluguStop.com

ఆ మాటలను వింటూ మనం కూడా మనం చేసే ప్రతీ పూజ, వ్రతానికి ముందు పసుపుతో గణపతిని తయారు చేసి… ప్రత్యేక పూజ చేస్తుంటాం.ఆ తర్వాతే మనం చేయాలనుకున్న పూజ చేస్కుంటాం.

అయితే పూజ అనంతరం ఆ పసుపు గణపతిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు.ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్తుంటారు.

దేవుడి గదిలో పెట్టుకుంటే సరిపోతుందని కొందరు చెప్పగా.మరి కొందరు మొహానికి రాస్కోవాలని చెప్తుంటారు.

అయితే ఏది నిజం.పూజ చేసిన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలోమనం ఇప్పుడు తెలుసుకుందాం.

పూజ చేసిన తర్వాత పసుపు గణపతికి నమస్కారం చేస్కొని… పసుపు గణపతిని ఉంచిన తమలపాకు తూర్పు దిశగా కదిలించాలి.పూజ తర్వాత ఆ హరిద్ర గణపతిని ప్రసాదంగా భావిస్తూ… ఇంట్లోని దేవుడి గదిలో ఉంచుకోవాలి.

ఆ తర్వాత ఓ మంచి రోజు చూస్కొని పుణ్య స్త్రీలు ఆ పసుపు గణపతిని మొహానికి రాసుకోవాలి.లేదా మంగళ సూత్రాలకు పూసుకోవాలి.కాళ్లు, చేతులు, శరీరం, పాదాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాసుకోకూడదు.అందులోనూ ఎలాంటి మైల లేని రోజుల్లోనే ఆ పుసపు గణపతిని పూసుకోవాల్సి ఉంటింది.

కుదరదు అనుకున్న వారు ఇంట్లోని బావిలో లేదా పచ్చని చెట్ల వద్ద ఉంచి నీళ్లు పోయాల్సి ఉంటుంది.అలా అన్ని తొక్కుడు పడే చోట ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయొద్దు.

బావిలో నిమజ్జనం చేయడం కూడా చాలా మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube