మన భారతదేశంలో పూర్వీకులు వినాయకుడికి ఉపవాసం వల్ల కోట్లాది లాభాలు ఖాయమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.గణపతి వ్రతం రోజున ఇంటిని శుభ్రం చేసి మామిడి ఆకులతో తోరణం కట్టి ఆ తర్వాత వ్రతం రోజున పిల్లలకు బియ్యపు పిండితో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.
అంతే కాకుండా కొంత మంది గణపతి భక్తులకు ప్రసాదంగా ఇవ్వాలి.ఇలా ఉపవాసం ఉంటే కోటి పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.
బుధవారం రోజు గణపతిని పూజించడం వల్ల అదృష్టం లభిస్తుంది.
ఇలా పూజ చేయడం వల్ల జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.బుధవారం రోజు గణపతి పూజతో జ్ఞానాన్ని పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు.బుధవారం రోజు ఉదయం స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులను ధరించి ధ్యానం మొదలుపెట్టిన తర్వాత పూజా స్థలంలో ఉత్తరం లేదా తూర్పు వైపున ఉన్న ఆసనం పై కూర్చుని శ్రీ గణపతి యంత్రాన్ని ప్రతిష్టించాలి.
గణపతికి పూలు ధూపం, దీపం, కర్పూరం, గంధం, మేధకం మొదలైన వాటిని సమర్పించడం మంచిది.చివరిలో వినాయకుడిని స్మరిస్తూ ఓం గం గణపతయే నమః అనే నామాన్ని 108 సార్లు జపించాలి.
బుధవారం రోజు ఇంట్లో తెల్లటి వినాయకుడిని ప్రతిష్టించడం వల్ల అన్ని రకాల తంత్ర శక్తి దూరమైపోతుంది.ఇంకా చెప్పాలంటే బుధవారం రోజున కూడా పెట్టిన ధనం శ్రేయస్కరం బుధవారం డబ్బు లావాదేవీలు చేయకూడదు.
సంపద పొందడానికి బుధవారం రోజు శ్రీ వినాయకుడికి నెయ్యి, బెల్లం సమర్పించాలి.అంతే కాకుండా ఈ నెయ్యి, బెల్లం ఆవుకు తినిపించాలి.
ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.