యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నయనమనోహరంగా సాగిన స్వామివారి అమ్మవారి ఎదుర్కోలు మహోత్సవం బ్రహ్మోత్సవాలలో అత్యంత అద్బుతమైన సుందర ఘట్టం ఈ ఎదుర్కోలు మహోత్సవం ముందుగా స్వామివారిని వజ్రవైడూర్య మని హరలతో వివిద రకాల రంగురంగుల పూలతో ముస్తాబు చేసి ఆశ్వవాహనంపై భాలాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలతో భక్తుల జయజయధ్వానాలతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు.
అనంతరం ఉత్సవ మండపంలో స్వామివారిని అమ్మవారని వేంచేపి .
పండితులు అర్చకులు మరియు అధికారులు స్వామివారి అమ్మవారి గుణగణాలను వివరించి స్వామి అమ్మవార్ల అవతార వైభోగాలను భక్తలకు వివరించి కళ్యాణ మాటమంతి కొనసాగించారు…అమ్మవారికి, స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి తిరు కళ్యాణ మహోత్సవంనకు సుముహూర్త సమయం ఖరారు చేశారు బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజైన శుక్రవారం ఉదయం తులాలగ్న పుష్కరాంశన యాదగిరీశుడి తిరు కళ్యాణం వైభోగం నిర్వహించుటకు నిర్వహించారు పండితులు.ఎదుర్కోలు మహోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈఓ గీతారెడ్డి.
అనువంశిక ధర్మకర్త బి.నరసింహ మూర్తి, వేదపండితుల అర్చకులు పాల్గోన్నారు .మరియు ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా ఎదుర్కోలు మహోత్సవంను తిలకించి తరలించారు….