నేటి నుంచి తెలంగాణ హైకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం

తెలంగాణ హైకోర్టులో జరిగే కేసుల విచారణ నేటి నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.కేసుల విచారణను సామాన్యులు సైతం వీక్షించేలా సుప్రీం ధర్మాసనం ఇటీవలే ప్రత్యక్ష ప్రసారాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

 Live Telecast Of Telangana High Court Hearings From Today-TeluguStop.com

ఈ విధంగానే ఇవాళ్టి నుంచి హైకోర్టులో విచారణను కూడా ప్రజలు వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.దీనిలో భాగంగా మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూయన్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపే కేసుల విచారణను తొలిసారిగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

జాతీయ ప్రాధాన్యం ఉన్న కేసులతో పాటు రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసుల విచారణను లైవ్ ఇవ్వడానికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది.ఈ వాదనలు ప్రారంభం అయ్యే ముందే ప్రత్యక్ష ప్రసారం గురించి అధికారులకు తెలియజేస్తారు.

న్యాయవాదులకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే బెంచ్ ముందు చెప్పేందుకు అనుమతి ఇచ్చారు.అయితే, దేశ చరిత్రలోనే తొలిసారిగా హైకోర్టు ఆన్ లైన్ లో కేసుల విచారణను చేపట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube