నిన్న రాజ్యసభ సాక్షిగా ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరు పట్ల చేసిన కామెంట్లు 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.అప్పటి కేంద్ర ప్రభుత్వం యూపీఏ విభజించిన సమయంలో… ఏటువంటి చర్చకు.
బీజేపీ.పిలుపు ఇవ్వకుండా… విభజన బిల్లుకు సహకరించడం జరిగిందని ఏపీ విభజనకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బాధ్యత కాదని బీజేపీ సహకారం కూడా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్. మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల నిన్నటి నుండి విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
నల్ల బ్యాడ్జీలతో మోడీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని.నిరసన తెలపాలని కూడా పిలుపునివ్వడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా నేడు మోడీ తీరుపై మరింతగా కేటీఆర్ సీరియస్ అయ్యారు.దేశ చరిత్రలో ఈ విధంగా మాట్లాడిన ప్రధాని మరొకరు లేరని సెటైర్లు వేశారు.
ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన ప్రధాని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.రైతుల పోరాటాలతో రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారని స్పష్టం చేశారు.
అభివృద్ధిలో గుజరాత్ కంటే తెలంగాణ దూసుకుపోతున్న నేపథ్యంలో.కడుపు మంటతో రాజ్యసభలో తెలంగాణపై ప్రధాని మోడీ నీచమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు.
చాలా అసహ్యంగా ప్రధాని మోడీ మాట్లాడారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.