కన్నడలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కేజీఎఫ్ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో కేజీఎఫ్ సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఇప్పటికే మెజారిటీ శాతం సినిమా షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఇప్పటికే తారక్కు ప్రశాంత్ నీల్ ఓ కథను కూడా వినిపించాడని, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమాను త్రివిక్రమ్ సినిమా తరువాతే పట్టాలెక్కించాలని తారక్ భావిస్తున్నాడు.
దీంతో ప్రశాంత్ నీల్ వేరే ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
కేజీఎఫ్ చిత్ర నిర్మాతలు ప్రశాంత్ నీల్తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.అయితే ఈ సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించాలని సదరు చిత్ర నిర్మాతుల భావిస్తున్నారట.
దీంతో ప్రభాస్ కోసం కూడా ప్రశాంత్ నీల్ ఓ పవర్ఫుల్ కథను రెడీ చేశాడని, త్వరలోనే ఈ కథను ఆయనకు వినిపించేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.మరి తారక్ను పక్కనబెట్టి ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సినిమా చేస్తాడా అనే అంశం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.